China Earthquake | చైనాలో భూకంపం.. నేపాల్​కు వరద హెచ్చరికలు

చైనాలోని సియాచిన్​ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : China Earthquake | చైనాలో భూకంపం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు నైరుతి చైనాలోని సియాచిన్​ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:13 గంటలకు ప్రావిన్స్‌ను తాకింది. ఈ భూకంప కేంద్రం 29.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 105.22 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ఈ భూకంపం 13 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ప్రభావంతో నేపాల్ (Nepal)​కు మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

China Earthquake | రెడ్​ అలర్ట్​..

నేపాల్‌కు మరో భారీ జల ప్రళయం ముప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఐదు రెట్ల అధిక తీవ్రతతో నేపాల్‌కు వరదలు వస్తాయని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర భయాందోళనలో నేపాల్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.

 

దీనిని కూడా చదవండి : BRS Protest | కాంగ్రెస్​ వైఫల్యాలపై బీఆర్​ఎస్​ పోరుబాట

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *