అక్షరటుడే, వెబ్డెస్క్ : Singareni Workers | మొక్కుబడిగా మెడికల్ బోర్డు (Medical Board)ను నిర్వహిస్తూ మరోసారి సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. 120 మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచి కేవలం 12 మందినే అన్ ఫిట్గా ప్రకటించడం అన్యాయం అన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత కొంతకాలంగా పోరాడుతున్నారు. బాయిబాట పేరిట ఆమె సింగరేణిలో పర్యటించారు. కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో ఉన్న కార్మికులకు అన్ఫిట్గా ప్రకటించి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని సైతం ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టింది. దీనిపై కవిత ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
Singareni Workers | కార్మికులకు న్యాయం చేయాలి
సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని కవిత కోరారు. వారి కుటుంబాలకు భరోసా కల్పించాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకున్న ప్రతి కార్మికుడిని అన్ ఫిట్ గా ప్రకటించి వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
దీనిని కూడా చదవండి : Konda Surekha Rakhi | సీఎం రేవంత్రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ