PM Modi on Terrorism | ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి : ప్రధాని మోదీ

ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: PM Modi on Terrorism | యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావని, ఘర్షణలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సూచించారు. కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు.

అనేక దేశ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసిన మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతీయ కూటమి SCO శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సమక్షంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని కూడా పిలుపునిచ్చారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని మనం ఏకతాటిపై నిలబడాలన్నారు. తీవ్రవాద భావజాల వ్యాప్తిని, ఉగ్రవాద సురక్షిత స్థావరాలను నిర్మూలించాలని పేర్కొన్నారు.

PM Modi on Terrorism | 2001లో ప్రారంభం

వివిధ రంగాలలో సమర్థవంతమైన, పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని ప్రోత్సహించడంతో పాటు, సంబంధాలను బలోపేతం చేయడమే SCO ప్రధాన లక్ష్యాలు కాబట్టి, ప్రధాని మోదీ వ్యాఖ్యలు ముఖ్యమైనవి. 10-సభ్యుల SCOను 2001లో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు స్థాపించాయి. 2017లో భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరగా, 2023లో ఇరాన్, 2024లో బెలారస్ చేరాయి. ఈ సారి శిఖరాగ్ర సమావేశం ‘SCO-ప్లస్’ ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇందులో డజనుకు పైగా ఇతర అనుబంధ దేశాల నాయకులు పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి..: AAP Protest | బీజేపీ ఎంపీ తరుణ్​ చుగ్​ ఇంటి వద్ద ఉద్రిక్తత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *