అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasthan Heavy Rains | రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధోల్పూర్లో వరద ముంచెత్తింది. దీంతో రహదారులు, లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.
వర్షాలతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతి నది (Parvathi River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పార్వతి నది డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సైపౌ, మాలోని, సఖ్వారా దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. దౌసా జిల్లాలోని మహ్వాతో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరింది. వాతావరణ శాఖ అధికారులు 20 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Rajasthan Heavy Rains | నీట మునిగిన రోడ్లు..
భారీ వర్షాలతో వాగుల్లో నీటి మట్టాలు పెరిగి, సవాయి మాధోపూర్, బరన్, బుండి మరియు కోటా ప్రాంతాల్లోని అనేక చోట్ల కాజ్వేలు నీట మునిగిపోయాయి. వర్షాలు సెప్టెంబర్ 8 వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలు కురుస్తుండటంతో జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో భరత్పూర్లోని బంధ్ బరేథా ఆనకట్ట రెండు గేట్లు ఎత్తారు. ధోల్పూర్లోని పార్వతి ఆనకట్ట, ఝలావర్లోని కాళీసింధ్ ప్రాజెక్ట్, కోటాలోని నవనేరా డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
Kanpur, Uttar Pradesh: Rising Pandu River has flooded several areas of Kanpur, affecting thousands of homes and forcing families onto rooftops or temporary shelters. Low-lying areas remain severely affected. Food and drinking water shortages are emerging, while livestock are also… pic.twitter.com/aV2PH4vnd7
— IANS (@ians_india) September 6, 2026
దీనిని కూడా చదవండి : BRS Meeting | ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో బీఆర్ఎస్ఎల్పీ భేటీ.. పొంగులేటి విమర్శలు