అక్షరటుడే, వెబ్డెస్క్ : Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఏసీ (BAC)లో నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశం జరిగింది. తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు సభలోకి వెళ్లకుండ అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలకు గాయాలు అయ్యాయి.
Assembly Sessions | రీయింబర్స్మెంట్పై చర్చ
బీఆర్ఎస్ (BRS) మినహా మిగతా పార్టీలు బీఏసీ సమావేశానికి హాజరు అయ్యాయి. వారంపాటు సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై మరోసారి భేటీ కానున్నట్లు స్పీకర్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చకు బీఏసీ ఆమోదం తెలిపింది. 22ఏపై జ్యుడీషియల్ విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 25 అంశాలపై చర్చించాలని ఆ పార్టీ నాయకులు కోరారు.
Assembly Sessions | హరీశ్రావును అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీలో BAC సమావేశానికి హాజరు కావాలంటూ హరీశ్ రావు (Harish Rao)కి స్పీకర్ ఫోన్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి ఆయన బయలుదేరారు. తెలంగాణ భవన్ గేటు వద్దే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నట్లు హరీశ్రావు ప్రకటించారు.
ఈ వీడియో చూడండి : యూట్యూబర్ నందన్ అరెస్ట్