అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganesh Festival Nizamabad | నగరంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మేయర్ ఉమారాణి అన్నారు. నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండలి నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
Ganesh Festival Nizamabad | పోలీసుల సూచనలు పాటించాలి..
మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ వినాయక మండపాల నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడుతూ, గణేష్ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని, పోలీసు అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా ఉత్సవాల సమయంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ధ్వని వ్యవస్థల పరిమితులు, ఇతర నిబంధనల గురించి మండలి నిర్వాహకులకు వివరించారు. ఈ సమావేశంలో ఏసీపీ ప్రకాష్, 2వ టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై యాదగిరి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Sepsis Awareness | ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేయవద్దు.. సెప్సిస్పై అప్రమత్తతే ప్రాణరక్షణ