Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిని తవ్వేశారు.. ఆందోళనలో రైతులు..

Shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement | రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే దారిని ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేశారు. లింగంపేట(lingampet) మండలం మాలపాటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Paddy Procurement | మండలంలోని మాలపాటిలో..

ఈ సందర్భంగా మాలపాటి గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి (Paddy Procurement Center) వెళ్లే రోడ్డును ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తవ్వేశారన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు లారీలు వెళ్లే అవకాశం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక మాఫియా పనేనని అనుమానం..?

లింగంపేట మండలంలోని పెద్దవాగు నుంచి శెట్​పల్లి సంగారెడ్డికి (Shetpally Sangareddy) చెందిన కొందరు వ్యక్తులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. అయితే వారు నేరుగా కాకుండా మాలపాటి గ్రామ రైతుల పొలాల నుంచి ఇసుకను తరలిస్తుండేవారన్నారు. రెండు రోజుల క్రితం శెట్​పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మూడు ఇసుక ట్రాక్టర్లను (Sand Tractors) పోలీసులు పట్టుకుని సీజ్​ చేశారని.. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా ఈ పనికి ఒడిగట్టిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై దీపక్​కుమార్​ దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

road1

ఇది కూడా చదవండి: West Bengal Election Results | బెంగాల్​లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *