నిజామాబాద్Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిని తవ్వేశారు.. ఆందోళనలో రైతులు..

Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిని తవ్వేశారు.. ఆందోళనలో రైతులు..

లింగంపేట మండలం మాలపాటి గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే దారిని ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేశారు.

అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement | రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే దారిని ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేశారు. లింగంపేట(lingampet) మండలం మాలపాటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Paddy Procurement | మండలంలోని మాలపాటిలో..

ఈ సందర్భంగా మాలపాటి గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి (Paddy Procurement Center) వెళ్లే రోడ్డును ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తవ్వేశారన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు లారీలు వెళ్లే అవకాశం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక మాఫియా పనేనని అనుమానం..?

లింగంపేట మండలంలోని పెద్దవాగు నుంచి శెట్​పల్లి సంగారెడ్డికి (Shetpally Sangareddy) చెందిన కొందరు వ్యక్తులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. అయితే వారు నేరుగా కాకుండా మాలపాటి గ్రామ రైతుల పొలాల నుంచి ఇసుకను తరలిస్తుండేవారన్నారు. రెండు రోజుల క్రితం శెట్​పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మూడు ఇసుక ట్రాక్టర్లను (Sand Tractors) పోలీసులు పట్టుకుని సీజ్​ చేశారని.. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా ఈ పనికి ఒడిగట్టిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై దీపక్​కుమార్​ దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

road1

ఇది కూడా చదవండి: West Bengal Election Results | బెంగాల్​లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

TVS EV Sales | టీవీఎస్ మోటార్ జోరు.. గణనీయంగా పెరిగిన ఈవీ సేల్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVS EV Sales | టీవీఎస్ మోటార్...

Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లిలోనే ఏర్పాటు చేయాలి..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Agriculture College | వ్యవసాయ కళాశాలను జక్రాన్​పల్లి...

India Election Shocks| సొంత నియోజకవర్గాల్లో వెనుకబడ్డ హేమాహేమీలు.. ముగ్గురు సీఎంలకు షాక్.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Election Shocks| పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి...