అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Congress Allegations | కాంగ్రెస్ పార్టీ దొంగలు వరంగల్ రైతు డిక్లరేషన్ (Warangal Farmers Declaration) పేరిట రైతులను దగా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్లో నిర్వహించిన రైతు సంగ్రామ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) దొంగలు వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులను మోసం చేశారన్నారు. వరంగల్లో సభ పెట్టి రాహుల్ గాంధీ అనేక హామీలు ఇచ్చారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసా రూ.15 వేలు, వరి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చారన్నారు. వాటిని నమ్మి ప్రజలు ఓటు వేస్తే.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు చేయడం లేదని మండిపడ్డారు.
KTR Congress Allegations | సీఎం ఏం చేస్తున్నట్లు
వరంగల్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు సంగ్రామ సభ పెట్టామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇచ్చిన డిక్లరేషన్ ఎక్కడ ఉందని, ఆయన ఏడ పోయారని ప్రశ్నించారు. ఈ రోజు పంటలు అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి, రాహుల్ గాంధీ ఫొటోలను బస్టాండ్లలో అతికించి దొంగలున్నారు జాగ్రత్త అని రాయాలన్నారు.
KTR Congress Allegations | కరోనా కంటే డేంజర్
కరోనా కంటే కాంగ్రెస్ డేజంర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడి సాయం సకాలంలో జమ చేశామని గుర్తు చేశారు. కానీ నేడు ఒక్క పంటకు కూడా రైతు భరోసా జమ కావడం లేదని విమర్శించారు. రైతు బంధును ఎందుకు బంద్ పెట్టారని సీఎం (CM Revanth Reddy)ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెలకు ఒక ఎకరాకు డబ్బులు వేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రైతు భరోసా (Rythu Bharosa) బంద్ చేసి రాహుల్ గాంధీకి డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. రాహుల్కు కప్పం కట్టి సీఎం సీటును రేవంత్రెడ్డి కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Jubilee Hills Honeytrap | జూబ్లీహిల్స్లో హనీ ట్రాప్ గ్యాంగ్ బాగోతం.. తల్లి-కొడుకుల గలీజ్ దందా వెలుగులోకి

