అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Red Cross Services | సమాజసేవలో నిజామాబాద్ రెడ్క్రాస్ సంస్థ (Nizamabad) సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం (World Red Cross Day), ప్రపంచ తలసేమియా (Thalassemia) డేను పురస్కరించుకుని రెడ్క్రాస్ సొసైటీలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
Red Cross Services | మానవ సేవే.. మాధవ సేవ..
ముందుగా రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డూనంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు మాట్లాడుతూ.. మానవ సేవే మహోన్నత సేవ అని రెడ్క్రాస్ బలంగా నమ్ముతుందన్నారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమని, ప్రతిఒక్కరూ స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన పెంపొందించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా బాల్భవన్లో (Bal Bhavan) నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
Red Cross Services | తలసేమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్లో..
అనంతరం రెడ్క్రాస్ తలసేమియా (Thalassemia Awareness) బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్లో (Blood Transfusion Center) తలసేమియా బాధిత చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ 87వసారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపే రవీందర్, కార్యదర్శి గోక అరుణ్ బాబు, డివిజన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీశైలం, మండల ఛైర్మన్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బొద్దుల రామకృష్ణ, రెడ్క్రాస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: TVK Government Formation| గవర్నర్ వైఖరిపై అసహనం.. కోర్టు మెట్లెక్కనున్న విజయ్

