అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Division Problems | నగరంలోని 27వ డివిజన్లో సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (Municipal Corporation Commissioner) దిలీప్ కుమార్ తెలిపారు. డివిజన్ పరిధిలో కార్పొరేటర్ కల్పె అర్చన చిరంజీవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజుతో కలిసి పర్యటించారు.
Nizamabad Division Problems | దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి..
ఈ సందర్భంగా డివిజన్లోని పలు కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రెయినేజీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతామని కార్పొరేషన్ కమిషనర్ హామీ ఇచ్చారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ పరిష్కారం కోసం కార్పొరేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత కార్పొరేటర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలంలో తాగునీటి సమస్య (Drinking Water Problem) రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో 27వ డివిజన్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Digital Census Telangana | రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జనగణన..: ఆర్డీవో ప్రభాకర్

