అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుల్లో 151 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Commissionerate) పరిధిలోని నిజామాబాద్, బోధన్(Bodhan), అర్మూర్ డివిజన్ల పరిధిలో పోలీసులు వారంరోజుల పాటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 151మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 11మందికి ఆయా న్యాయస్థానాలు జైలుశిక్ష విధించాయి. మిగిలిన వారికి రూ.10,40,000 జరిమానా వేశాయని తెలిపారు.
Drunk Driving Cases | మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..
మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సీపీ సూచించారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఆర్నెళ్లపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్(Driving License Suspension) చేస్తామని హెచ్చరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదన్నారు.
ఇది కూడా చదవండి: Signal Free City| హైదరాబాద్కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

