అక్షరటుడే, వెబ్డెస్క్: PMJ Jewellers Robbery | కరీంనగర్ (Karimnagar) పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో పోలీసుల కీలక పురోగతి సాధించారు. ఇందరు నిందితులతో పాటు బంగారం కొనుగోలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్లోని జ్యోతినగర్లో గల పీఎంజే జ్యువెల్లరీస్ (PMJ Jewellers)లో ఈ నెల 3న దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. దుండగులు ఉదయం పూట దుకాణంలోకి చొరబడి దోపిడీ చేశారు. సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం బంగారు ఆభరణాలను తీసుకొని పరారు అయ్యారు. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ధర్మపురి వైపు వెళ్లినట్లు గమనించారు. ధర్మపురిలోని గోదావరి తీరంలో బైక్ను వదిలేసి దుండగులు పరారు అయ్యారు.
PMJ Jewellers Robbery | బీహార్లో నగల విక్రయం
దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం ఇతర రాష్ట్రాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దోచుకున్న బంగారాన్ని బీహార్ (Bihar)లో విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితుల కొసం బెంగాల్, బీహార్లో గాలిస్తున్నారు. అరెస్ట్పై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు. అయితే వారిని కరీంనగర్ తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Kaushik Reddy | నాపై హత్యాయత్నం చేశారు..: కౌశిక్ రెడ్డి

