జాతీయంBJP Leader Rally | ప్రధాని మాట పట్టించుకోని బీజేపీ నేత.. 50 కార్లతో ర్యాలీ

BJP Leader Rally | ప్రధాని మాట పట్టించుకోని బీజేపీ నేత.. 50 కార్లతో ర్యాలీ

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు దాదాపు 50 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో ప్రయాణించాడు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Leader Rally | పెట్రోల్​, డీజిల్​ ఆదా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇటీవల ప్రజలను కోరిన విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు స్వయంగా తన కాన్వాయ్​లో కార్ల సంఖ్యను సైతం తగ్గించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలన ఓ బీజేపీ నేత పట్టించుకోలేదు.

ఏకంగా 50 కార్లతో ర్యాలీ తీశారు.మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు చెందిన ఒక బీజేపీ నాయకుడు దాదాపు 50 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మధ్యప్రదేశ్ టెక్స్ట్‌బుక్ కార్పొరేషన్‌కు కొత్తగా నియమితులైన చైర్మన్ సౌభాగ్య సింగ్ ఠాకూర్ బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తూ మద్దతుదారుల వాహనాలతో కలిసి ఉజ్జయిన్ నుండి భోపాల్‌కు ప్రయాణించారు. మద్దతుదారులు ఠాకూర్‌కు స్వాగతం పలకడానికి పలుచోట్ల ఆగుతుండగా, ఆ కాన్వాయ్ హైవే పొడవునా విస్తరించి ఉన్నట్లు కనిపించింది. పదేపదే కాన్వాయ్​ ఆగడంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినట్లు సమాచారం.

BJP Leader Rally | తీవ్ర విమర్శలు

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం, దాని వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడగల ఒత్తిడి దృష్ట్యా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేసిన కేవలం రెండు రోజులకే ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంధన పొదుపుపై ప్రధాని చేసిన బహిరంగ విజ్ఞప్తిని ఆయన సొంత పార్టీలోని నాయకులే పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలను బీజేపీ నాయకుడి భారీ కాన్వాయ్ లేవనెత్తింది.

ఇది కూడా చదవండి..: UAE Indian Billionaires | యూఏఈ బిలియనీర్లలో మనోళ్ల అధికం.. 17 మందిలో 9 మంది భారతీయులే!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Amaravati Development| బంగారం కొనకండి.. పొదుపు పెంచండి: సీఎం చంద్రబాబు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Amaravati Development|అమరావతి అభివృద్ధి , రాష్ట్ర భవిష్యత్తుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

CBSE 12th Results| సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

అక్షరటుడే వెబ్‌డెస్క్:CBSE 12th Results|దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సెంట్రల్...

Jogipet Diesel Theft| జోగిపేటలో చెడ్డి గ్యాంగ్ కలకలం.. బస్సులు, లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Jogipet Diesel Theft|సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు...

Gold Price Hike | సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి..ఒకేరోజు రూ.వేలల్లో పెరుగుదల

అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Hike | పసిడి కొనాలనుకునే వారికి...