Maize Transport Process | మొక్కజొన్న పంటను వెనువెంటనే గోడౌన్లకు తరలించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Maize Transport Process | రైతుల పంట ఉత్పత్తులను సేకరించిన అనంతరం వెనువెంటనే గోడౌన్లకు తరలించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (nizamabad collector Ila Tripathi) ఆదేశించారు. మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండాలో మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని (maize procurement) గురువారం తనిఖీ చేశారు. అలాగే శ్రీనగర్ శివారులోని గోడౌన్​ను సైతం సందర్శించారు.

Maize Transport Process | కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా..

ముందుగా కొనుగోలు కేంద్రంను తనిఖీ చేసిన కలెక్టర్​.. రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. మొక్కజొన్న పంట నాణ్యత, తేమ శాతంను స్వయంగా పరిశీలించిన ఆమె.. ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్ (Electronic Weighing Machine) ద్వారా తూకం సరిగా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. రైతులు పంట ఉత్పత్తులు కేంద్రానికి తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను వెనువెంటనే గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున త్వరితగతిన మొక్కజొన్న నిల్వలను గోడౌన్లకు తరలించి జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. అవసరమైన సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని, మొక్కజొన్న రవాణాలో జాప్యానికి తావులేకుండా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు నిర్దిష్ట గడువు లోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని అన్నారు.

Maize Transport Process | శ్రీనగర్​లోని గౌడౌన్​ పరిశీలన

అనంతరం శ్రీనగర్​లోని గోడౌన్​ను కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న నిల్వల అన్​లోడింగ్ తీరును, మొక్కజొన్న బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. గోడౌన్​లో పూర్తి సామర్థ్యం మేరకు పంటను నిల్వ చేయాలని, పంటకు ఎలాంటి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న స్టాక్‌ను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ట్రాన్స్​పోర్ట్ కాంట్రాక్టర్​ను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోళ్లను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రేఖా నాయక్, ఎంపీడీవో నరేష్, మార్క్​ఫెడ్ సిబ్బంది భాస్కర్ తదితరులున్నారు.

coll2

ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *