నిజామాబాద్Nizamabad Paddy Procurement | రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిజామాబాద్​

Nizamabad Paddy Procurement | రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ.. రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిజామాబాద్​

యాసంగి సీజన్​కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Paddy Procurement | యాసంగి-2026 సీజన్​కు సంబంధించి వరిధాన్యం సేకరణలో నిజామాబాద్(Nizamabad) జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector ila tripathi) తెలిపారు. శుక్రవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

Nizamabad Paddy Procurement | 5.68 లక్షల మెట్రిక్​ టన్నులకు పైగా..

జిల్లాలో ఇప్పటికే 5.68 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు వరిధాన్యం సేకరణ పూర్తి చేశామని కలెక్టర్​ వివరించారు. కేవలం ఐదు శాతం మేరకు మిగిలి ఉన్న మరో 32,797 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం వారం రోజుల్లోపు పూర్తయ్యేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, రైస్ మిల్లుల(Rice mills) వద్ద ధాన్యం అన్​లోడింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ఈ సీజన్​లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా, 95 శాతం ధాన్యం సేకరణ పూర్తి చేశామని తెలిపారు. సేకరించిన ధాన్యం విలువ రూ.1,358.20 కోట్లు కాగా, అందులో 61,442 మంది రైతులకు వారి ఖాతాల్లో రూ. 1162.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు.

Nizamabad Paddy Procurement | ట్యాబ్​ ఎంట్రీల్లో..

ట్యాబ్ ఎంట్రీలలో(Tab Entry) నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉందని, కేవలం మరో 9శాతం ట్యాబ్ ఎంట్రీలు పూర్తికావాల్సి ఉందన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా వేగవంతంగా రైస్ మిల్లులకు చేరవేసే విషయంలోనూ నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన ఉందని, మిల్లర్ల నుండి 96శాతం మేర ఎక్​నాలెడ్జ్​మెంట్​ పూర్తయ్యిందని వివరించారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ కోసం సరిపడా హమాలీలు, లారీలను సమకూర్చామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ఇది కూడా చదవండి: Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీలో కీలక నిందితుడి అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Paper Leak | నీట్ (NEET...

Telangana Udyamakarula Committee | తెలంగాణ ఉద్యమకారులకు ‘రాజ గౌరవం’.. జర్నలిస్టులకు గుర్తింపు లభించేనా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Udyamakarula Committee | స్వరాష్ట్ర కల సాకారం కోసం...

Nampally Railway Station | నాంపల్లి రైల్వే స్టేషన్​లో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nampally Railway Station | హైదరాబాద్ (Hyderabad)​...