అక్షరటుడే, వెబ్డెస్క్: UP Encounters | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చి లో అధికారం చేపట్టారు. ఆయన ‘జీరో టాలరెన్స్’కు ప్రాధాన్యత ఇచ్చారు. నేర సామ్రాజ్యానికి అడ్డాగా మారిన యూపీని మార్చేందుకు కఠినంగా వ్యవహరించారు. సీఎం ఇచ్చిన స్వేచ్ఛతో పోలీసులు విజృంభించారు. చట్టాలకు విలువ ఇవ్వని కరడుగట్టిన నేరగాళ్లకు తూటాలతో బదులివ్వడం ప్రారంభించారు.
UP Encounters | తొమ్మిదేళ్లలో 17 వేల ఎన్కౌంటర్లు..
యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సీఎం అయ్యాక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఎన్కౌంటర్లు భారీగా పెరిగాయి. అధికారిక డేటా ప్రకారం 2017 నుంచి 2026 ప్రారంభం వరకు 17,043 ఎన్కౌంటర్ ఆపరేషన్లు జరిగాయి. ఇందులో సుమారు 289 మంది నేరస్తులు మరణించారు. ఒక్క 2025 సంవత్సరంలోనే 48 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఆయా ఎన్కౌంటర్లలో 11 వేల మందికిపైగా గాయపడ్డారు. 34 వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక చావు భయంతో స్వచ్ఛందంగా లొంగిపోయిన నేరస్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. మీరట్, వారణాసి, బరేలీ జోన్లలో ఎన్కౌంటర్లు ఎక్కువగా జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.
UP Encounters | 18 మంది పోలీసుల వీరమరణం..
నేరాలను అదుపు చేసేందుకు యూపీలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో పోలీసులు సైతం మృత్యువాతపడ్డారు. ఈ తొమ్మిదేళ్లలో 18 మంది పోలీసులు వీరమరణం పొందారు. 1,852 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..: EPFO WhatsApp | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో వాట్సాప్ ద్వారా సేవలు!


