అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Pipeline Leakage Issue | నగరంలోని మిర్చి కాంపౌండ్కు వెళ్లే దారిలో మంచినీటి పైప్లైన్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA dhanpal) అధికారులను ఆదేశించారు. నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్లలో మున్సిపల్ కమిషనర్(Nizamabad Municipal Commissioner) దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు.
Pipeline Leakage Issue | మూడురోజులుగా ఇబ్బందులు
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా మంచినీటి పైప్లైన్ లీకేజీకి (pipeline leakage) గురైందని, దీంతో మురికి నీరు కలుషితమై నల్లాల్లోకి వస్తున్నాయన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్ను సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. నూతన పైప్లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సైతం కార్పొరేటర్లకు, ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని సూచించారు. అలాగే మిర్చి కాంపౌండ్లో చేతిపంపులకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Pipeline Leakage Issue | గంజ్ కమాన్ వద్ద..
ప్రధానంగా గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రెయినేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించలేదని కమిషనర్ను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. వచ్చే మూడు రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, కార్పొరేషన్ ఏఈ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి: YS Jagan Comments | కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సంచలన వ్యాఖ్యలు


