అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL Tickets | ఐపీఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. మరో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో ప్రతి మ్యాచ్ను ప్రేక్షకులు ఉత్కంఠగా చూస్తున్నారు. హైదరాబాద్ (Hyderbad)లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు.
ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి సన్రైజర్స్, ఆర్సీబీ (SRH vs RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే రెండో స్థానానికి, భారీ రన్రేట్తో గెలిస్తే మొదటి స్థానానికి చేరుకుంటుంది. ఈ మ్యాచ్కు భారీగా క్రేజ్ ఉండటంతో గతంలోనే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం టికెట్ రేట్లను భారీగా పెంచింది. అయితే యాప్లో టికెట్లు విడుదల చేసిన నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి. కొందరు టికెట్లను బుక్ చేసుకొని బ్లాక్ దందాకు తెరలేపారు.
IPL Tickets | రూ.వేయి టికెట్ రూ.10 వేలకు..
ఉప్పల్ స్టేడియం స్టేడియం దగ్గర జోరుగా బ్లాక్ టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రేపు మ్యాచ్ ఉండటంతో గురువారం నుంచే బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారు. రూ.వేయి టికెట్ను రూ.10 వేల నుంచి రూ..20 వేల వరకు అమ్ముతున్నారు. గేట్ నంబర్ 2 దగ్గర జోరుగా టికెట్ల దందా సాగుతోంది. రూ.10 వేల టికెట్ ఏకంగా రూ.లక్షకు పైగా అమ్ముతున్నట్లు సమాచారం. ఆన్లైన్లో టికెట్ దొరకని అభిమానులు ఉప్పల్ స్టేడియం దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.
IPL Tickets | పోలీసుల ఫోకస్
బ్లాక్ టికెట్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్లాక్లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బ్లాక్లో టికెట్లు అమ్ముతున్న ముఠాపై 10 కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ సీజన్లో హైదరాబాద్లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో భారీగా క్రేజ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : SRH Playoffs | క్లాసెన్ – ఇషాన్ కిషన్ కిల్లింగ్ షో.. చెన్నైకి షాక్, ప్లే ఆఫ్స్లోకి సన్రైజర్స్ హైదరాబాద్!


