White Collar Jobs | ఏఐతో వైట్​ కాలర్​ ఉద్యోగాలకు ముప్పు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : White Collar Jobs | ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత తమ దృక్పథాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏఐతో వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయ పడ్డారు. అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ జాబ్​లను ఏఐ రిప్లేస్ చేయలేదన్నారు.

White Collar Jobs | ఏటీసీలతో కొత్త కోర్సులు

చైనా, జపాన్ (Japan), కొరియాకు మనం ప్రత్యామ్నాయం కావాలని సీఎం పేర్కొన్నారు. త్వరలో గల్ఫ్‌ కార్మికుల కోసం మంచి పాలసీ తీసుకు వస్తామని చెప్పారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఏటీసీ (ATC) కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. టాటా సంస్థతో కలిసి ATCలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించామని తెలిపారు.

White Collar Jobs | ఆ దేశాల్లో డిమాండ్​

ఏదైనా చదువుకుంటే ఉద్యోగం రావాలి లేదా ఉపాధి అవకాశమైనా ఉండాలని సీఎం అన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. జీవన ప్రమాణాలు కూడా అమెరికా కన్నా మెరుగ్గా ఉన్నాయని వెల్లడించారు. ఇంగ్లీష్​ రాకున్నా కొన్ని దేశాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయని తెలిపారు. అక్కడి ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే జర్మన్, జపనీస్ భాషలు నేర్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని సీఎం చెప్పారు.

White Collar Jobs | అమెరికా కొట్టుకుపోయే పరిస్థితి

25 ఏళ్ల క్రితం ఐటీ, కంప్యూటర్ కోర్సులు చేసి, అమెరికా (America) వెళ్లొచ్చనే భావన ఉండేదని రేవంత్​రెడ్డి అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో పెను మార్పులొచ్చాయని తెలిపారు. ఏఐ తుపానులో అమెరికానే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులను అనుగుణంగా యువత దృక్పథం కూడా మారాలన్నారు.

దీనిని కూడా చదవండి: Land Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *