అక్షరటుడే, వెబ్డెస్క్ : NEET Paper Leak Arrest | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ (NEET Exam) వ్యవహారంలో అరెస్ట్లు కొనసాగుతున్నాయి. తాజాగా పూణె (pune)లో మనీషా సంజయ్ హవల్దార్ను సీబీఐ అరెస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా మే 3న నీట్ యూజీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. జూన్ 21న మళ్లీ పరీక్ష పెడతామని ప్రకటించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది. కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు కీలక నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మనీషాను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఫిజిక్స్ పేపర్ లీక్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం11 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.
NEET Paper Leak Arrest | ఫిజిక్స్ పేపర్పై యాక్సెస్
ప్రస్తుతం పూణేలోని సేథ్ హీరాలాల్ సరఫ్ ప్రశాలలో మనీషా సంజయ్ హవల్దార్ను పని చేస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిపుణురాలిగా నియమించిన తర్వాత హవల్దార్ నీట్ యూజీ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నపత్రంపై పూర్తి యాక్సెస్ ఉంది. ఏప్రిల్లో ఆమె కొన్ని ప్రశ్నలను సహ నిందితురాలు మనీషా మంధారేతో పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన ఆరోపణపై పూణేకు చెందిన లెక్చరర్ పి.వి. కులకర్ణిని గతంలోనే అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అహల్యానగర్కు చెందిన ధనంజయ్ లోఖండే, నాసిక్కు చెందిన శుభం ఖైర్నార్, జైపూర్కు చెందిన మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్, హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన యశ్ యాదవ్ను అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : Tiger Attack Chandrapur | తునికాకు కోసం వెళ్లి.. పులి దాడిలో నలుగురు మహిళల మృతి


