Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి

Shashi kiran Mottala
Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాల్లో సందడి..

అక్షరటుడే, ఇందూరు: Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా పర్వదినం నిజామాబాద్​ జిల్లాలోని ఆలయాల్లో సందడి నెలకొంది. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేశారు.

Akshaya Tritiya | నగరంలోని కంఠేశ్వరాలయంలో..

జిల్లా కేంద్రంలోని (Nizamabad City) కంఠేశ్వరాలయంలో (Kanteshwar Temple) ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయంలోని భోళా శంకరుడికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున తమకు అన్ని శుభాలే కలగాలని కోరుతూ భక్తులు పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విపరీతమైన ఎండలు కాస్తున్నందున ఆలయంలో చలువ పందిళ్లు వేయించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే అక్షయ తృతీయ రోజు కొంతైనా బంగారం (Gold) కొనాలనే ఉద్దేశంలో పలువురు బంగారం కొనుగోలు చేశారు.

kant2

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *