అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Alisagar Cable Bridge | అలీసాగర్పై (Alisagar Tourism) తీగల వంతెనకు ప్రతిపాదనలు పంపనున్నట్లు అడిషనల్ కలెక్టర్ భుజంగరావు పేర్కొన్నారు. శుక్రవారం అలీసాగర్ను(Alisagar) ఆయన సందర్శించారు.
Alisagar Cable Bridge | పర్యాటక కేంద్రంగా..
అలీ సాగర్ను పర్యాటక (Telangana Tourism) కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. పార్క్, ఉద్యానవనం, బోటింగ్ పాయింట్, హరిత హోటల్ను సందర్శించారు. హరిత హోటల్లో పర్యాటకుల వివరాలను తెలుసుకున్నారు. అలాగే బోటింగ్ సిబ్బందికి పర్యాటకుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రాబోయే రోజుల్లో అలీ సాగర్ను అభివృద్ధి పర్చడానికి కాంపౌండ్ వాల్, తీగల వంతెన, రాత్రి విడిది కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ