అక్షరటుడే, వెబ్డెస్క్: Balka Suman Case | నాంపల్లి పోలీస్ స్టేషన్ (Nampally Police Station)లో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు అయింది. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలంటూ.. మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేయగా.. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
Balka Suman Case | వివాదం ఏమిటంటే..
బాల్క సుమన్ మంగళవారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని అన్నారు. ఉధృతమైన నిరసనలకు సిద్ధం కావాలన్నారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మందమర్రి ఏరియాలోని జీఎం ఆఫీసు వద్ద, హైదరాబాద్లోని సింగరేణి భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేయాలని సూచించారు. సింగరేణి భవన్ తగలబెట్టాలని కార్యకర్తలకు సూచించారు. రైలు రోకో నిర్వహించి రైల్వే లైన్లను కోసి పారేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలన్నారు.
Balka Suman Case | అరెస్ట్ చేస్తారా..
మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. నాయకులు రెచ్చగొడితే తర్వాత కార్యకర్తలు బలి అవుతారని పేర్కొంటున్నారు. కేసుల పేరిట కోర్టుల చుట్టూ తిరిగే సమయంలో ఎవరు తోడుగా ఉండరని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని సూచించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారా.. లేదా అనేది చూడాలి.
ఇది కూడా చదవండి..: Electric Buses | ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం


