అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Basara IIIT | బాసర(Basara) ట్రిపుల్ ఐటీలో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా తాజాగా బుధవారం మరో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
Basara IIIT | ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న..
నిర్మల్(Nirmal) జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని బుధవారం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన అక్కడి అధ్యాపకులు, సిబ్బంది ఆమెను భైంసా ఆస్పత్రికి.. అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Rahul Gandhi NEET | పేపర్ లీకేజీని ఆపలేక యాప్లపై నిషేధమా?: రాహుల్ గాంధీ