అక్షరటుడే, ఇందూరు: Chaganti Koteswara Rao | లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూరు(Nizamabad) గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారులోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో ‘గోమాత వైభవం’పై (Gomata Vaibhavam) ప్రవచనం నిర్వహించారు.
Chaganti Koteswara Rao | చాగంటికి ఘనస్వాగతం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ చాగంటి కోటేశ్వర రావుకు ఘనస్వాగతం పలికి సన్మానించి మాట్లాడారు. తన అద్భుతమైన ప్రవచనాలతో రామాయణం, భారతం, భాగవతం వంటి మహా గ్రంథాల్లోని విలువలను సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా చాగంటి వివరిస్తారన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కుటుంబ విలువలు(anatana Dharma), ధర్మం గొప్పతనాన్ని నేటి తరానికి చేరవేయడంలో ఆయన చేస్తున్న సేవ అమూల్యమైందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు చాగంటి చేస్తున్న యజ్ఞం ఎంతో గొప్పదన్నారు. ఇందూరులో గోమాత వైభవంపై ప్రవచనం చెప్పడానికి రావడం ఇక్కడి భక్తుల పూర్వ జన్మ సుకృతం అన్నారు. సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముక్కోటి దేవతలను గోవులో చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ