అక్షరటుడే, ఎల్లారెడ్డి : Kanyaka Parameswari Jayanti | వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఎల్లారెడ్డి ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుక్లపక్ష దశమిని పురస్కరించుకొని వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Kanyaka Parameswari Jayanti | పోచమ్మ గుడి వరకు ఊరేగింపు
వైశ్యులు స్థానిక దొరవారి హనుమాన్ మందిరం నుంచి కలశం హారతితో పోచమ్మ గుడి వరకు ఊరేగింపుగా వెళ్లారు. ఆలయంలోని అమ్మవారికి అభిషేకం చేసి వాసవి మాత ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కుంకుమార్చనలు, ఓడి బియ్యం, అమ్మవారి చరిత్ర సామూహిక పారాయణం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. సాయంత్రం మంగళహారతులు దాండియా అంతాక్షరి పిల్లల సాంస్కృతిక నృత్యాలు, షోడశోపచార పూజలో నృత్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ప్రత్యేక హారతులు పవళింపు సేవతో పాటు అల్పాహారం వితరణ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల బాలకిషన్ గుప్తా, వందలాది వైశ్యులు పాల్గొన్నారు.

Kanyaka Parameswari Jayanti | సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
వైశ్యుల ఆరాధ్య దేవత వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. జయంతి వేడుకలను పురస్కరించుకొని వాసవి మాత ఆలయంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక శాసనసభ్యులు మదన్మోహన్ రావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాతకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారి చిత్రపటాలకు సిద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్యుల కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసిందని కొనియాడారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Vasavi Matha Jayanti | కలెక్టరేట్లో ఘనంగా వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి

