అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: SIR Mapping Process | పట్టణ ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ (SIR mapping) ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై సోమవారం హైదరాబాద్ (Hyderabad) నుంచి ముఖ్య ఎన్నికల అధికారి (election commission India) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్షించారు.
SIR Mapping Process | తెలంగాణలో వేగవంతం చేయాలి..
ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా జరిగిందని, తెలంగాణలోనూ(Telangana elections) వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు మ్యాపింగ్ ప్రక్రియ విషయంలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు, సూపర్వైజర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉండాలన్నారు.
బూత్ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినందున వారి సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బీఎల్వోలతో స్వయంగా మ్యాపింగ్ చేయించుకునేందుకు ఆసక్తి చూపితే మిగిలిన వారి మ్యాపింగ్ చేసేందుకు సులభతరమవుతుందని అన్నారు.
SIR Mapping Process | నిజామాబాద్ జిల్లాలో..
కాగా.. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిలో ఉందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ (Nizamabad Municipal Corporation) పరిధిలో వివిధ కారణాల వల్ల కొంత వెనుకబడి ఉందన్నారు. అర్బన్లో 44.78 శాతం మ్యాపింగ్ జరిగిందని, ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి వారం పది రోజుల వ్యవధిలో 70 శాతం వరకు మ్యాపింగ్ పూర్తి చేయిస్తామని తెలిపారు.
ఎస్ఐఆర్ మ్యాపింగ్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

