అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినా.. మూడు రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
ఈ నెల 27 నుంచి 30 మధ్య తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. పలు చోట్ల 44 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుంది. అదే సమయంలో దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సైతం చిరుజల్లులు కురుస్తాయి.

Telangana Rain Alert | మే నెలలో..
రాష్ట్రంలో మే 1 నుంచి 3 వరకు ఎండ తీవ్రత (Heat Wave) అధికంగా ఉంటుంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంటాయి. మే 4 నుంచి 8 వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే పలు ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయి. రానున్న పది రోజులు ఎండలు, వర్షాలు ఉంటాయి. దీంతో రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ధాన్యం ఆరబోసిన రైతులు టార్పాలిన్లు కప్పుకోవాలి.
దీనిని కూడా చదవండి : BRS Formation Day | పల్లె నుంచి పట్నం వరకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి: కేటీఆర్

