అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Anil kumar | నిజామాబాద్ ఎంపీ అర్వింద్ (MP Arvind)పై కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. అర్వింద్ తలపై వెంట్రుకలు లేవని, ఎండలో తిరగడంతో ఆయన గుండుకు వడదెబ్బ తాకినట్లునందని ఎద్దేవా చేశారు.
అర్వింద్ ఇటీవల నిజామాబాద్ (Nizamabad)లో మట్లాడుతూ.. సీఎంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి (Revanth Reddy)కి ప్రధాని మోదీతో లింక్లు ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఎంపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురి అర్వింద్ నెత్తిపై వెంట్రుకలు లేక గుండు తో ఉన్నాడన్నారు. హీట్వేవ్లో ఎక్కడ తిరిగి వచ్చాడో తెలియదు కానీ, వచ్చి ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారని అన్నారు.
MP Anil kumar | మంత్రి అడ్లూరి ఫైర్
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే.. బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
MP Anil kumar | అద్దంకి ఆగ్రహం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సైతం ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ అన్ని చోట్ల ఒరిజినల్ బీజేపీ వాళ్లకే పదవులు ఇచ్చిందా అని ప్రశ్నించారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి, అస్సాం సీఎం హేమంత బిశ్వా ఏ పార్టీ నుంచి వచ్చారన్నారు. డీఎస్ లేకపోతే అర్వింద్ బతుకు ఎక్కడ అన్నారు.
దీనిని కూడా చదవండి: Dharmapuri Arvind|జగిత్యాల బీజేపీ సీనియర్లపై ఎంపీ అరవింద్ తీవ్ర ఆగ్రహం


