అక్షరటుడే, వెబ్డెస్క్ : Rs 1.27 Crore Bill | ఓ ఇంటికి ఏకంగా రూ.1.27 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో దానిని చూసిన ఇంటి యజమాని ఖంగు తింది. ఈ ఘటన సూర్యాపేట (Suryapeta) జిల్లాలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కొత్త తండాలో రమావత్ రాణి అనే మహిళ ఇంటికి ఇటీవల విద్యుత్ సిబ్బంది కరెంట్ బిల్లు కొట్టారు. అందులో ఏకంగా రూ.1,27,76,968 బిల్లు వచ్చింది. బిల్లు చూసి షాకైన ఇంటి యజమానురాలు ఆందోళనకు గురైంది. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసింది. TGSPDCL నిర్లక్ష్యం వల్లే ఇలా బిల్లు తప్పుగా వచ్చిందని సమాచారం. సాంకేతిక కారణాలతో ఇలా జరిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బిల్లును సరి చేస్తామని చెప్పారు. దీంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది.
దీనిని కూడా చదవండి : Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
