అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chess Tournament | చెస్ ఆడితే చదువులోనూ ముందుంటారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్రావు అన్నారు. జిల్లాస్థాయి అండర్–11 బాలబాలికల చెస్ టోర్నీని Chess Competition) నగరంలోని అభ్యాస స్కూల్లో నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Chess Tournament | చెస్తో మెదడు చురుకుగా..
ఆయన మాట్లాడుతూ.. చెస్ ఆడితే మెదడు చురుకుగా మారుతుందని.. తద్వారా చదువులోనూ రాణించవచ్చన్నారు. విద్యార్థులు((Nizamabad) చెస్ ఆడేందుకు ఆసక్తి చూపాలన్నారు. జిల్లాస్థాయి చెస్ టోర్నీలో బాలుర విభాగంలో ఆర్మూర్ మోడల్ స్కూల్ విద్యార్థి డీ సోహన్, ప్రెసిడెన్సీ స్కూల్ విద్యార్థి అర్జున్ విజయం సాధించారు. అలాగే బాలికల విభాగంలో విజయసాయి స్కూల్ బోధన్ విద్యార్థిని నిత్యశ్రీ, సహారా కింగ్టౌన్ బోధన్ స్కూల్ విద్యార్థిని ఎస్ సాయి విజేతగా నిలిచారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ ప్రతినిధులు రమేష్, ఆర్డిటర్ శివ, సాయిబాబా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఓజీ సీక్వెల్ పనులు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్..