DCM Van Fire | డీసీఎంలో మంటలు.. డ్రైవర్​ సహా 200 మేకలు సజీవ దహనం

మహబూబ్​నగర్​ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: DCM Van Fire | మహబూబ్​నగర్​ జిల్లా (Mahabubnagar District)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డీసీఎం వ్యాన్​లో మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్​తో పాటు డీసీఎంలో ఉన్న 200 మేకలు సజీవ దహనం అయ్యాయి.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ వద్ద జాతీయ రహదారి 44పై గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. 200లకు పైగా మేకల లోడ్​తో వెళ్తున్న డీసెం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా డీజిల్ ట్యాంక్ పేలి, నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, వాహనంలో తరలిస్తున్న మేకలన్నీ సజీవ దహనం అయ్యాయి.

DCM Van Fire | ఐదుగురికి గాయాలు

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పి వేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Harish Rao Politics | రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *