అక్షరటుడే, వెబ్డెస్క్ : DMK Exits INDI Alliance | దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండి కూటమి నుంచి మరో పార్టీ వైదొలిగింది. కీలకమైన డీఎంకే (DMK) కాంగ్రెస్ కూటమికి గుడ్బై చెప్పింది.
తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్కంఠ మాత్రం వీడటం లేదు. టీవీకే (TVK) పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించగా మెజారిటీ 10 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంబన నెలకొంది. అయితే డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ అనుహ్యంగా టీవీకేకు మద్దతు తెలిపింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందింది. కూటమిలో చర్చించకుండా ఏకపక్షంగా టీవీకేకు మద్దతు ప్రకటించడంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఇండి కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
DMK Exits INDI Alliance | స్పీకర్కు లేఖ
పార్లమెంటులో సీట్ల కేటాయింపులో మార్పులు కోరుతూ DMK నాయకురాలు కనిమొళి (Kanimozhi) స్పీకర్కు లేఖ రాశారు. DMK ఇకపై కాంగ్రెస్తో కలిసి కూర్చోదని ఆమె పేర్కొన్నారు. DMKకి లోక్సభలో 22 మంది, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో సీట్ల కేటాయింపు విధానంలో మార్పులు చేయాలని కోరుతూ కనిమొళి స్పీకర్కు లేఖ రాశారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, భారత జాతీయ కాంగ్రెస్తో తమ కూటమి ముగిసిపోయిందని ఆమె ప్రకటించారు.
DMK Exits INDI Alliance | అఖిలేష్ పోస్ట్ వైరల్
సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ అధికారాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ, ఎం.కె. స్టాలిన్లతో తాను ఉన్న చిత్రాలను శుక్రవారం ఉదయం పోస్ట్ చేశారు. “కష్టకాలంలో ఒకరినొకరు వదిలేసే రకం నేను కాదు,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో టీవీకే అత్యధిక స్థానాలు గెలవగానే కాంగ్రెస్ డీఎంకేను వీడి ఆ పార్టీకి మద్దతు తెలిపింది.
DMK Exits INDI Alliance | కూటమి పని ఖతం
ఇండి కూటమిలో కాంగ్రెస్ పెద్ద పార్టీ కాగా పలు ప్రాంతీయ పార్టీలు కొనసాగుతున్నాయి. గతంలో నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ కూటమి నుంచి దూరంగా ఉంటున్నాయి. సమాజ్వాది పార్టీ, డీఎంకే మాత్రం ఆది నుంచి ఇండి అలియెన్స్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా డీఎంకే సైతం కూటమి నుంచి వైదొలగడంతో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్), ఆర్జేడీ, జేఎంఎం తదితర పార్టీలు ఉన్నాయి.
DMK MP Kanimozhi has written a letter to the Lok Sabha Speaker, requesting a change of seating arrangement in the Lok Sabha.
“I write to respectfully request suitable changes in the seating arrangement of the MP belonging to the DMK in the Lok Sabha. In view of the changed… pic.twitter.com/nFFsjQmFnt
— ANI (@ANI) May 8, 2026
దీనిని కూడా చదవండి : TVK Government Formation| గవర్నర్ వైఖరిపై అసహనం.. కోర్టు మెట్లెక్కనున్న విజయ్

