అక్షరటుడే, ఎల్లారెడ్డి : DOST Special Phase | తెలంగాణలోని(Telangana) ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) (DOST) ‘స్పెషల్ ఫేజ్’ (Special Phase) అడ్మిషన్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థుల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ ఫేజ్ను ప్రవేశపెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ దేవసేన (IAS) ఒక ప్రకటనలో తెలిపారు.
DOST Special Phase | అడ్మిషన్ల తేదీలివే..
జులై 20వ తేదీనుంచి 26 వరకు రూ. 400 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వెబ్ ఆప్షన్లను జులై 20 నుండి 27 వరకు పెట్టుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల పరిశీలన జులై 27న విశ్వవిద్యాలయ హెల్ప్ లైన్ సెంటర్లలో (UHL) జరుగుతుంది. జులై 30న స్పెషల్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జులై 30 నుండి ఆగస్టు 01 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు జులై 31 నుండి ఆగస్టు 01 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.
DOST Special Phase | పాత విద్యార్థులు..
గత విడతల్లో దోస్త్(DOST) లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటివరకు సీటు పొందని విద్యార్థులు, తమ పాత దోస్త్ ఐడీ, పిన్ ఉపయోగించి నేరుగా ఈ స్పెషల్ ఫేజ్లో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు దోస్త్లో దరఖాస్తు చేసుకోని వారు రూ.400 నమోదు రుసుము చెల్లించి కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదివరకే సీసీఓటీపీ ద్వారా కళాశాలల్లో చేరి తమ సీటును కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్కు అనర్హులని అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : ‘అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని జెనెరిక్ ఔషధాలపై ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు 0% సుంకం వర్తిస్తుంది.