అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving | నిజామాబాద్ కమిషనరేట్ (nizamabad commissionerate) పరిధిలో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మందుబాబుల్లో మార్పు రావట్లేదు. భారీగా జరిమానాలు విధిస్తూ.. జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ భయం లేకుండా మళ్లీ మద్యం తాగి రోడ్లపైకి వస్తున్నారు.
Drunk Driving | వారంరోజుల్లో..
కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ట్రాఫిక్(Nizamabad traffic police), బోధన్, ఆర్మూర్ పరిధుల్లో వారం రోజుల్లో పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 64మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లుగా గుర్తించారు. అనంతరం వారిని ఆయా కోర్టులో ప్రవేశపెట్టగా.. 9మందికి వారంరోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.5,50,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) ప్రకటన విడుదల చేశారు. మద్యం తాగి ఎట్టిపరిస్థితుల్లో రోడ్లపైకి రావొద్దని సూచించారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే ఆర్నెళ్ల పాట డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Money Mule Scam | ఖాతాదారులకు ఆర్బీఐ కీలక హెచ్చరిక.. ఇలా చేస్తే జైలుకే