అక్షరటుడే, ఆర్మూర్: MLA Rakesh Reddy | కాంగ్రెస్ నాయకుల మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లండని ఎమ్మెల్యే రాకేష్రెడ్డి పేర్కొన్నారు. అంకాపూర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
MLA Rakesh Reddy | ఇచ్చిన హామీని కాంగ్రెస్ మరిచించి..
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కళ్యాణలక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామ హామీ ఇచ్చి తుంగులో తొక్కిందని రాకేష్ రెడ్డి అన్నారు. మహిళలకు తాను అండగా ఉంటానన్నారు. మహిళలు ధైర్యంగా ఆ బంగారు గొలసులను అమ్మేసి తనకు రిసిప్ట్ పెట్టాలని సూచించారు. స్కూటీలు ఇస్తామని సైతం హామీ ఇచ్చి మోసం చేసిందని కాంగ్రెస్ నాయకుల షోరూంలలో నుంచి స్కూటీలు సైతం ఎత్తుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించుతామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
MLA Rakesh Reddy | చర్చకు రాకేష్ రెడ్డి సిద్ధం : దినేష్ కులాచారి
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చకు రాకేష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని.. పోలీసులే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లా ఏడారిగా మారుతోందన్నారు. జిల్లాకు అన్నపూర్ణగా ఉన్న శ్రీరాంసాగర్ ఈరోజు నీళ్లు లేక వెలవెలబోతోందన్నారు. అలాగే రైతులు సైతం నాట్లు వేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మహేష్ కుమార్ గౌడ్ను తాము అంకాపూర్కు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన ఇందూరులోనే ఉన్నారని.. ఎమ్మెల్యే ఇంటికి వస్తే అంకాపూర్ చికెన్తో భోజనం పెట్టిస్తామని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఆర్మూర్, ఇందూరు అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు.
ఇది కూడా చదవండి..: Bahrain Labour Union | బహ్రెయిన్ ‘ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్’ అధ్యక్షుడి రాజీనామా