E20 Fuel Issue | ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి: కేజ్రీవాల్‌ డిమాండ్

పెట్రోల్‌ బంకుల్లో ఈ20 ఇంధనం లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఏది కావాలనేది ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: E20 Fuel Issue | పెట్రోల్‌ బంకుల్లో ఈ20 ఇంధనం లేదా స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఏది కావాలనేది ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు కల్పించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) కోరారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ20 మిశ్రమ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

E20 Fuel Issue |వాణిజ్య ఒప్పందంపై ఆరోపణలు..

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగానే పౌరులపై ఈ20 ఇంధనాన్ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనివల్ల ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ ఇంధనం వాహనాలకు ఎలాంటి నష్టం కలిగించదని ప్రభుత్వం చెబుతున్న అధ్యయన నివేదికలను వెంటనే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. మిశ్రమ ఇంధనానికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించేందుకు ఆగస్టు 4న ఆయన నివాసం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి:  MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *