అక్షరటుడే, వెబ్డెస్క్: Fake Paneer Ban | నకిలీ పనీర్పై ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వచ్ఛమైన పాలకు బదులుగా కూరగాయల నూనెలు, పిండి పదార్థాలు, రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన పనీర్, నెయ్యి, వెన్నతో సహా నాసిరకం పాల, నకిలీ పాల ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా అమ్మకాలను నిషేధించింది.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద విధించిన ఈ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చింది. అసలైన పాల ఉత్పత్తులు కానప్పటికీ, వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్న పనీర్, నెయ్యి, వెన్న లేదా ఇతర పాల ఉత్పత్తుల పేర్లతో విక్రయించే వాటికి ఈ నిషేధం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. సురక్షితమైన, స్వచ్ఛమైన ఆహారం లభ్యతను నిర్ధారించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Fake Paneer Ban | రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు
ఆహార భద్రతా శాఖ డెయిరీ యూనిట్లు, గిడ్డంగులు, మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులలో దాడులు ప్రారంభించింది. అనుమానిత ఉత్పత్తుల నమూనాలను ప్రయోగశాల పరీక్షల కోసం పంపుతామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కల్తీ పదార్థాలు విక్రయిస్తే ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సదరు దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: PM Modi IIT Delhi | జీవితం చాలా పరీక్షలు పెడుతుంది : ప్రధాని మోదీ