భారతదేశంలోని ప్రముఖ అగ్రి-బిజినెస్ కంపెనీ అయిన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, తన అనుబంధ సంస్థ అయిన క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Creamline Dairy Products Limited) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గౌరవ్ పాండేను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నియామకంతో సంస్థ తన వ్యాపార వృద్ధిని వేగవంతం చేయాలని, మార్కెట్లో తన నాయకత్వాన్ని బలోపేతం చేయాలని , బ్రాండ్ ఉనికిని మరింతగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తన నియామకంపై స్పందిస్తూ గౌరవ్ పాండే మాట్లాడుతూ, భారతీయ పాడి పరిశ్రమలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలను , నాణ్యమైన విలువ ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గోద్రెజ్ జెర్సీ (Godrej Jersey) బ్రాండ్ ద్వారా క్రీమ్లైన్ సంస్థ ఇప్పటికే రైతులకు , వినియోగదారులకు ఒక బలమైన వ్యవస్థను నిర్మించిందని ఆయన ప్రశంసించారు. తన సమర్థవంతమైన బృందంతో కలిసి ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాటాదారులందరికీ దీర్ఘకాలిక విలువను అందించేలా కంపెనీని ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.