అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Hike | పసిడి కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్. కామారెడ్డిలో(Kamareddy) బంగారం ధర మళ్లీ కొండెక్కింది. ఇవాళ తులం రేటు అక్షరాల రూ.1,58,800 లకు చేరింది. నిన్నమొన్నటి వరకు రూ.1.52 లక్షలు ఉన్న ధర ఒక్కసారిగా రూ.6 వేలు ఎగబాకడంతో (kamareddy gold rates) జనం జంకుతున్నారు.
Gold Price Hike | అందకుండా పోతున్న వెండి..
వెండి కూడా సామాన్యుడికి అందకుండా పోతోంది. రూ.2,500 వద్ద ఉన్న వెండి ఇవాళ రూ.2,730 కి చేరి షాక్ ఇచ్చింది. పెళ్లిళ్ల సీజన్లో ఇలా రేటు మంట పుట్టించడంతో పేద, మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తులం బంగారం కొనాలంటే రెండు నెలల జీతం మొత్తం పెట్టాలని కొనుగోలుదారులు వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పేరు చెప్పి ఇక్కడ రేట్లు పెంచేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. వ్యాపారులు మాత్రం రేటు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, తగ్గేలా లేదని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో ప్రధాని మోడీ (PM Modi) ‘ఏడాది పాటు బంగారం జోలికి వెళ్లవద్దు’ అని సూచించిన మరుక్షణమే కాస్త తగ్గిన ధరలు, మళ్లీ పైకి లేవడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ఇది కూడా చదవండి: Kavitha Demands Lookout Notice| బండి సంజయ్ కుమారుడికి లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

