అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: School Buses | ఉమ్మడిజిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో రవాణా శాఖ (transport department) పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
School Buses | నగరంలో ప్రత్యేక తనిఖీలు..
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల (DTC Durga Pramila) ఆదేశాల మేరకు డీటీవో రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో అధికారులు నగరంలో ప్రత్యేక తనిఖీలు(bus inspection) చేపట్టారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు ఫిట్గా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. బస్సు డ్రైవర్ల లైసెన్స్లు, వాహనాల పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం డీటీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. చిన్నారులతో వెళ్లే బస్సులను వేగంగా నడపవద్దని సూచించారు. విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు అనుక్షణం డ్రైవర్లు గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని బస్సులు ఎట్టిపరిస్థితుల్లో రోడ్డు ఎక్కవద్దని హెచ్చరించారు. తనిఖీలులో ఎంవీఐలు, ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Casting Artist Harassment | కోరిక తీరిస్తేనే సినిమాల్లో ఛాన్స్.. యువనటిని వేధించిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్