Breakfast Scheme Launch | విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​ పథకం ప్రారంభించిన మంత్రి

వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పున : ప్రారంభం అయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Breakfast Scheme Launch | వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పున : ప్రారంభం అయ్యాయి. చాలా రోజుల తర్వాత విద్యార్థులు బడిబాట పట్టారు. తొలి రోజు కావడంతో చాలా మంది పాఠశాలకు వెళ్లలేదు.

రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్​ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని గతంలో ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్​ హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని రాజ్​భవన్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్, మిల్క్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి , కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈవో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్ పాల్గొన్నారు.

Breakfast Scheme Launch | అన్ని పాఠశాలల్లో..

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బ్రేక్​ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఉదయం విద్యార్థులకు టిఫిన్​తో పాటు, పాలు అందించనున్నారు. ఈ మేరకు గతంలోనే ప్రభుత్వం మెను విడుదల చేసింది. ఈ పథకాన్ని ప్రభుత్వ బడుల్లో ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్న భోజనం పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే ప్రారంభించాలి : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *