K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ ఫిర్యాదు

తన సోదరి కనిపించడం లేదని మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : K Namrata Missing | తన సోదరి కనిపించడం లేదని మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదన్నారు.

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమార్తె గద్వాల విజయలక్ష్మి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె గతంలో జీహెచ్​ఎంసీ మేయర్​గా పని చేశారు. ఇటీవల మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​గా నియామకం అయ్యారు. అయితే తన సోదరి కె నమ్రత (57) కనిపించడం లేదని ఆమె ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

K Namrata Missing | వారిపై అనుమానం

బంజారాహిల్స్  (Banjara Hills) రోడ్ నెం. 12లో ఉండే తన సోదరి ఈ నెల 4న ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదని విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సతీష్(35), సత్యనారాయణ(45), కుమారి(45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Breakfast Scheme Launch | విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​ పథకం ప్రారంభించిన మంత్రి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *