అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Bharat Gas Theft | నగరంలో వరుస చోరీలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు తేడా లేకుండా దొంగలు హల్చల్ చేస్తున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు.
Bharat Gas Theft | భారత్ గ్యాస్ ఏజెన్సీలో..

వన్ టౌన్ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్గార్డెన్ సమీపంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ (Bharat Gas Agency)లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముందుగా తాళాలు పగులగొట్టిన అనంతరం సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్ చేశారు. అనంతరం లోపలికి వెళ్లి లాకర్ను ధ్వంసం చేశారు. క్లూస్ టీం ప్రతినిధులు సంఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. సుమారు రూ.70వేలు చోరీకి గురైనట్లు ఏజెన్సీ నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు.
ఇది కూడా చదవండి..: School Buses | స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణాశాఖ అధికారులు