Train Robbery Attempt | రైలులో దోపిడీ దొంగల బీభత్సం.. కాల్పులు జరిపిన పోలీసులు

సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మహిళల నుంచి ఐదు తులాల బంగారం చోరీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Robbery Attempt | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న రైలులో అర్ధరాత్రి ప్రయాణికులను దోపిడీ చేసేందుకు యత్నించారు. సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

రైలు కాకినాడ జిల్లా బాపట్ల శివారు నల్లమడ వాగు రైల్వే వంతెన దగ్గరకు రాగానే. ఎస్‌-3, ఎస్‌-6 బోగీల్లో దొంగలు చొరబడ్డారు. నిద్రపోతున్న ఇద్దరు మహిళల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అయితే వారు వెంటనే లేచి అరిచారు. ప్రయాణికులు కేకలు వేయడంతో దొంగలు భయపడ్డారు. వెంటనే చైన్​ లాగి కిందకు దూకారు. రైలులోనే ఉన్న రైల్వే పోలీసులు దొంగలపై కాల్పులు జరిపారు. అయితే చీకటి కావడంతో అడవిలో దొంగలు తప్పించుకున్నారు.

Train Robbery Attempt | గాలింపు చర్యలు

Train Robbery Attempt

రైల్వే పోలీసులు దొంగలపై 9 రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా వారు తప్పించుకున్నారు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలసీఉలు దుండగుల కోసం అప్పికట్ల-బత్తిపూడి పొలాల్లో గాలిస్తున్నారు. కాగా గతంలో సైతం దేశంలోని పలు రైళ్లలో దొంగలు దోపిడీ చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Jnaneshwari Missing Case | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *