అక్షరటుడే, వెబ్డెస్క్: TDP Rajya Sabha | తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. పార్టీ తరఫున రాజ్యసభకు పంపనున్న అభ్యర్థుల పేర్లను అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం.
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు నేతల పేర్లపై పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

TDP Rajya Sabha | విస్తృతంగా చర్చలు
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై గత కొంతకాలంగా పార్టీ స్థాయిలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అభ్యర్థుల పేర్లపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!
