అక్షరటుడే, ఇందూరు: Power Cuts in Nizamabad | నగరంలో విద్యుత్ కోతలు ప్రజలను వేధిస్తున్నాయి. వేళాపాళా లేని కోతల కారణంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా అవస్థలు పడుతున్నారు.
Power Cuts in Nizamabad | అర్ధరాత్రి వేళ..
నగరంలోని పలు డివిజన్లలో ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా కరెంట్ సరఫరా (Power Supply)లో అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొంటున్నప్పటికీ నగరంలో ఆ పరిస్థితి లేదని ఆయా డివిజన్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో కరెంట్ కోతల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పడుతున్నామని వారంటున్నారు. ఓవైపు గాలివాన.. మరోవైపు విద్యుత్ లేక నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Power Cuts in Nizamabad | 27వ డివిజన్లో..
27 డివిజన్లోని సీతారాంనగర్ కాలనీలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లలోనే పవర్ కట్ అవుతుండడంతో ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనధికార కోతల నుంచి తమకు విముక్తి కల్పించాలని.. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: MLA Dhanpal | విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండాలి..: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్