అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : MeeSeva Irregularities | మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు (Vigilance Officers) రంగంలోకి దిగారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
MeeSeva Irregularities | సర్టిఫికెట్ల విషయంలో అవినీతి..
మీసేవ కేంద్రాల్లో సాధారణంగా ప్రజలు కళ్యాణలక్ష్మి, బర్త్ అండ్ డెత్, కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే చాలామందికి దరఖాస్తు చేసిన అనంతరం సర్టిఫికెట్ తీసుకునే విషయంలో ఎవరికి కలవాలి.. ఎక్కడ కలవాలనే సందిగ్ధంలో ఉంటారు. అలాగే కొన్నింటికి సరైన పత్రాలు వారి వద్ద ఉండవు. అయితే దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది మీసేవ సెంటర్ల నిర్వాహకులు తాము సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న మీసేవ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇచ్చిన సర్టిఫికెట్లు.. దరఖాస్తులు తదితర వివరాలను సేకరించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి..: Nizamabad Jail Warder | జైలు వార్డర్ క్రిమినల్ ప్లాన్.. డబ్బు కోసం ఏకంగా ఖైదీతో బేరసారాలు..