అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government ITI Admissions | ఎల్లారెడ్డిలోని(Yellareddy) ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు(ITI Admissions) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రూపా నాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Government ITI Admissions | పదో తరగతి పాసైన విద్యార్థులు..
పదో తరగతి(SSC) పాసైన అభ్యర్థులు వచ్చేనెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్, మెకానిక్, ఇంజినీర్ డిజైనింగ్ టెక్నీషియన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్ (Industrial Robotics) అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, సీఎన్సీ మిషన్ టెక్నీషియన్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే ఈ సదవకాశాన్ని వినియోగివంచుకోవాలని సూచించారు.


