నిజామాబాద్Yellareddy Development | అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్న బీఆర్ఎస్ నాయకులు

Yellareddy Development | అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్న బీఆర్ఎస్ నాయకులు

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ లింగంపేట మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం అన్నారు. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.

అక్షరటుడే, లింగంపేట: Yellareddy Development | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీఆర్​ఎస్​ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని.. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ (Congress Party) లింగంపేట మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత పదేళ్లు పరిపాలించిన బీఆర్​ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఓడించి మూలకు కూర్చోబెట్టారన్నారు. బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు పోల్కంపేట్ చౌదరి చెరువుకు గండిపడి మూడేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే మదన్​మోహన్​ ఆధ్వర్యంలో వెంటనే మరమ్మతులు చేయించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సొంత గ్రామమైన నల్లమడుగులో కొన్నేళ్లుగా మురికికాల్వల సమస్య ఉండేదని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ (MLA Madan Mohan) వచ్చాకే డ్రెయినేజీల నిర్మాణం పూర్తయిందన్నారు. నియోజకవర్గంలో రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తగదన్నారు.

Yellareddy Development | లింగంపల్లి వంతెనకు నిధులు మంజూరు

లింగంపల్లి వంతెన, మల్లారం చెరువు, పోల్కంపేట్ చౌదరి చెరువుల మరమ్మతులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారని గోకుల్​ సాయిరాం చెప్పారు. వెంటనే పనులు ప్రారంభమవుతాయని రైతులు అధైర్య పడవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజు, పీసీసీ మైనార్టీ కార్యదర్శి రఫీయొద్దీన్, నారా గౌడ్, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు సక్రు, ప్రసాద్ గౌడ్, కుండా బాలకిషన్, సేవ్యా, ఎల్లమయ్య, రాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Rajiv Gandhi Tribute | యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత రాజీవ్​దే : డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

India Africa Summit|ఎబోలా ఎఫెక్ట్.. భారత్-ఆఫ్రికా సదస్సు వాయిదా

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Africa Summit|ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తుండటంతో, ఈ నెల...

Telangana Railway Projects| అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. రైల్వే పనులపై ప్రత్యేక సమీక్ష

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana Railway Projects|తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల కల్పన, కొత్త...

Rupee Fall | రూపాయి పతనం ఆగేనా? బ్రహ్మాస్త్రం రెడీ చేస్తోన్న కేంద్ర బ్యాంక్!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rupee Fall | అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి...